Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సంగారెడ్డి
విధుల్లో ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మృతి చెందిన ఘటన సంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. జిల్లాలోని చౌటకూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న పద్మలత బుధవారం తరగతి గది నుంచి బయటకు వచ్చి నీళ్లు తాగి కుప్పకూలిపోయింది. ఈ తరుణంలో వెంటనే ఆమెను సహచర ఉపాధ్యాయులు 108 అంబులెన్స్లో సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.