Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణలో ఎండలు విపరీతంగా దంచికొడుతున్నాయి. బుధవారం పలు జిల్లాల్లో గరిష్ఠంగా 44 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ తరుణంలో అత్యధికంగా జయశంకర్ జిల్లా మహదేవ్పూర్, జగిత్యాల జిల్లా మల్లాపూర్లో 44.5 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలిపింది. తర్వాత ఆదిలాబాద్ జిల్లా తలమడుగు 44.3, సూర్యాపేట జిల్లా గరిడేపల్లి, జగిత్యాల జిల్లా వెల్గటూర్లో 44.2, నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో, ఆదిలాబాద్ జిల్లా భీమ్పూర్లో, ములుగు జిల్లా తాడ్వాయిలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి 44.0 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణశాఖ తెలిపింది.