Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
దేశ వ్యాప్తంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ లో 9,212 కానిస్టేబుల్ (టెక్నికల్, ట్రేడ్స్మ్యాన్) పోస్టుల భర్తీకి మార్చిలో విడుదల చేసిన నోటిఫికేషన్లో కీలక సవరణలు చేశారు. పదోతరగతి, ఐటీఐ ఉత్తీర్ణులైన పురుష/ మహిళా అభ్యర్థుల నుంచి మార్చి 27 నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తుండగా ఆ గడువు ఏప్రిల్ 25తో ముగియనుంది. ఈ తరుణంలో దరఖాస్తుల గడువును మే 2వరకు పొడిగిస్తున్నట్టు సీఆర్పీఎఫ్ వెల్లడించింది.
అభ్యర్థుల సౌలభ్యం కోసమే ఈ గడువును పొడిగించామని తెలిపింది. అంతే కాకుండా కానిస్టేబుల్(డ్రైవర్) పోస్టులకు గతంలో 21-27 ఏళ్ల వయో పరిమితి విధించగా దాన్ని ప్రస్తుతం 21-30 ఏళ్లకు పెంచింది. కానిస్టేబుల్(మోటార్ మెకానిక్ వెహికల్, కోబ్లర్, కార్పెంటర్, టైలర్, బ్రాస్ బ్యాండ్, పైప్ బ్యాండ్, బగ్లర్, గార్డెనర్, పెయింటర్, కుక్, వాటర్ క్యారియర్, వాషర్మన్, బార్బర్, సఫాయి కర్మచారి, మేసన్, ప్లంబర్, ఎలక్ట్రీషియన్) పోస్టులకు గతంలో వయోపరిమితి 18-23 ఏళ్లు ఉండగా ప్రస్తుతం 18-26 ఏళ్లకు మార్పు చేసింది. గతంలో 9212 కానిస్టేబుల్ పోస్టులకు అదనంగా మరో 148 ఉద్యోగాలను జత చేయడంతో ఖాళీల సంఖ్య ప్రస్తుతం 9360కి పెరిగింది. అభ్యర్థుల ఎత్తు, ఫిజికల్ ఎఫీషియన్సీ టెస్టుకు సంబంధించి పలు మార్పులు చేసినట్లు సీఆర్పీఎఫ్ ఆ ప్రకటనలో తెలిపింది.