Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నలుగురు దళారులు అరెస్ట్
నవతెలంగాణ-కాజీపేట
బాలలను వివిధ పరిశ్రమలలో పని చేయించడానికి అక్రంగ తరలిస్తున్న బాలలను గుర్తించి బాలల సంరక్షణ కేంద్రంకు తరలించినట్లు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ అనిల్ చందర్రావు, కాజీపేట ఆర్పిఎఫ్ సీఐ సంజీవరావు తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ కాజీపేట ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సమన్వయ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కాజీపేట మీదుగా హైదరాబాద్ న్యూఢిల్లీ వెళ్లే రైళ్లలో అక్రమంగా తరలించే బాలలను గుర్తించాలని, వివిధ శాఖలు స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో సమావేశం ఏర్పాటు చేసుకొని సమావేశ నిర్ణయాల ప్రకారం బుధవారం దర్భంగా నుండి సికింద్రాబాద్ వెళ్ళు ఎక్స్ప్రెస్ రైలులో 34 మంది బాల కార్మికులను గుర్తించినట్లు తెలియజేశారు. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం.సంజీవ రావు ఆధ్వర్యంలో రైల్వే పోలీస్ ఇన్స్పెక్టర్ ఎం రామ్మూర్తి, ఆర్పీఎఫ్ బృందం బచ్పన్ బచావో ఆందోళన్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ లైన్ 1098 బృందంగా ఏర్పడింది. కాజీపేట నుండి బల్లర్ష వరకు వివిధ ట్రైన్ లలో స్పెషల్ డ్రైవ్ చేయగా 34 మంది బాలలను వివిధ పరిశ్రమలలో పని చేయించడానికి తీసుకు వెళుతున్నట్లుగా గుర్తించారు. దీంతో బృందం కాజీపేట రైల్వే స్టేషన్లో సదరు పిల్లలను నిలిపివేసి వారిని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఆదేశాల మేరకు స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించడం జరిగింది. సంబంధిత పిల్లల వివరాలను కనుక్కొని సదరు యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకొనుటకు వారి నుండి వివరాలు సేకరించి, స్వగ్రామంలో ఉన్న పిల్లల తల్లిదండ్రులను పిలిపించి వారికి అప్పగించనున్నట్లు అప్పటివరకు తాత్కాలిక వసతి నిమిత్తం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారి ఆదేశాల మేరకు పిల్లలందరినీ స్థానిక బాలల సంరక్షణ కేంద్రానికి తరలించినట్లు తెలియజేశారు. వీరి పూర్తి వివరాలు కనుకొని తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. పిల్లలందరూ 18 సంవత్సరాల లోపు వారేనని అన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ లో బచ్పన్ బచావో ఆందోళన్ స్ట్రీట్ కోఆర్డినేటర్ అందే వెంకటేశ్వర్లు, ఏపీవో నరేష్, జిల్లా బాలల పరిరక్షణ విభాగం మెరుగు శ్రీనివాసులు, జి సునీత, చైల్డ్ లైన్ జ్ఞానేశ్వరి, రమేష్ , ఆర్పిఎఫ్ ఎస్ఐ శ్రావణి, జిఆర్పి ఎస్ఐ. పరశురాము, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు సందసాని రాజేంద్రప్రసాద్ డాక్టర్ పరికి సుధాకర్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఎస్. ప్రవీణ్ కుమార్, ఎల్సిపిఓ సతీష్ కుమార్, ఎం. శృతి రవికృష్ణ, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.