Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేరళ
ప్రయాణంలో ఉండగా మంటలు చెలరేగి ఓ బైక్ పూర్తిగా దగ్ధమైంది. బైక్ రన్నింగ్లో ఉండగానే ఇంజిన్లో నుంచి పొగలు వచ్చాయి. అనంతరం బైక్ మొత్తం మంటలు అంటుకున్నాయి. బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు.. ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక దళం.. వెంటనే అక్కడికి చేరుకుని మంటలను ఆర్పేసింది. కేరళ తిరువనంతపురంలోని కన్యాకుమారి నాగర్కోయిల్ ప్రాంతంలో ఘటన జరిగింది. ఏప్రిల్ 18న.. సాయంత్రం 4 గంటల సయమంలో ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. వాహనదారులు బైక్పై వెళ్తున్న సమయంలో ఇంజిన్ నుంచి పొగ రావడం ప్రారంభమైంది. దీన్ని గమనించిన బైకర్.. వెంటనే వాహనాన్ని రోడ్డు పక్కన ఆపాడు. పొగ మరింత పెరిగి మంటలు రావడం వల్ల.. వాటిని ఆర్పేందుకు ప్రయత్నం చేశాడు. దానికి స్థానిక వ్యక్తులు, ట్రాఫిక్ పోలీసులు కూడా సాయం చేశారు. అయినా ఫలితం లేకపోయింది. బైక్ నుంచి మంటలు రావడం ఎక్కువై వాహనం మొత్తం వ్యాపించాయి. దీంతో అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు స్థానికులు. అనంతరం వారొచ్చి మంటలను ఆర్పేశారు.