Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - సూరత్: పరువునష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. క్రిమినల్ డిఫమేషన్ కేసులో స్టే విధించాలని కోరుతూ రాహుల్ దాఖలు చేసిన పిటిషన్ను సూరత్ కోర్టు తిరస్కరించింది. ఆ కేసులో రెండేళ్ల శిక్ష విధించిన విషయం తెలిసిందే. ఆ శిక్ష కారణంగా రాహుల్ తన లోక్సభ సభ్యత్వాన్ని కూడా కోల్పోయారు.
అయితే ఈ కేసులో అప్పీల్ చేసుకునేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో రాహుల్ కోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల శిక్షను రద్దు చేయాలని కోరారు. కానీ సూరత్ సెషన్స్ కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చింది. రేపు గుజరాత్ హైకోర్టులో ఇదే కేసులో రాహుల్ పిటిషన్ వేయనున్నారు.