Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి
తూర్పు గోదావరి జిల్లాలో దారుణఫం చోటుచేసుకుంది. రాజానగరం జిల్లా పరిషత్ హై స్కూల్ 9 తరగతి విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఓ అమ్మాయితో ప్రేమ వ్యవహారమై 9 తరగతి చదువుతున్న విద్యార్థుల మధ్య వివాదానికి కారణంగా చెబుతున్నారు.
మాటామాట పెరగడంతో ఘర్షణకు దారితీసింది. ఈ తరుణంలో గొడవ పెరగడంతో రాజానగరం చెందిన లోడగాల ఉదయ్ శంకర్ అనే విద్యార్థి అదే తరగతిలో చదువుతున్న తూర్పు గానుగూడెంకు చెందిన పింక్ హరి సాయి అనే మరొక విద్యార్థిపై దాడి చేశాడు. కత్తితో పొడిచాడు ఉపాధ్యాయులు అంతా ఉండగానే ఎగ్జామ్ హాల్ లో ఈ ఘటన జరిగింది. దీంతో హుటాహుటిన రాజమండ్రిలోని ఓ ప్రయివేట్ ఆస్పత్రికి తరలించారు టీచర్లు ఈ మేరకు పోలీసులకు సమాచారం అందించారు. హాస్పటల్ లో హరిసాయికి వైద్యులు శస్త్ర చికిత్స చేస్తున్నారు.