Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఢిల్లీ
దేశవ్యాప్తంగా మొత్తం 142 విద్యాసంస్థల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్టు తేదీలు విడుదల అయ్యాయి. జూన్ 5 నుంచి 12వ తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించనున్నట్టు యూజీసీ ఛైర్మన్ మామిడాల జగదీశ్ కుమార్ వెల్లడించారు. తదుపరి అప్డేట్ల కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లను చెక్ చేసుకోవాలని ఆయన సూచించారు.
అంతే కాకుండా సీయూఈటీ (పీజీ) దరఖాస్తుల గడువు ఏప్రిల్ 19తో ముగియడంతో ఆ గడువును మే 5 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. పీజీల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు మే 5వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఎన్టీఏ ఓ ప్రకటనలో తెలిపింది.