Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - గ్వాలియర్: మధ్యప్రదేశ్లోని గ్వాలియర్ జూలోకి కొత్త అతిథులు వచ్చారు. గ్వాలియర్లోని గాంధీ జూపార్క్లో ఉన్న మీరా అనే తెల్ల పులి మూడు కూనలకు జన్మనిచ్చింది. దీంతో ఈ జూలో పులుల సంఖ్య పదికి చేరింది. గురువారం ఉదయం 11.30 గంటలకు మీరా మూడు పిల్లలకు జన్మనిచ్చిందని జూ క్యూరేటర్ డాక్టర్ గౌరవ్ పరిహార్ తెలిపారు. వాటిలో ఒకటి తెల్ల పులి పిల్ల అని చెప్పారు. ప్రస్తుతం తల్లితోపాటు పిల్లలు కూడా పూర్తి ఆరోగ్యంగా ఉన్నాయని వెల్లడించారు. ప్రత్యేక ఎన్క్లోజర్లో ఉంచి వాటిని సంరక్షిస్తున్నామన్నారు. మీరా 2013లో ఇదే జూలో జన్మించిందని పేర్కొన్నారు. పదేండ్లలో అది మూడు సార్లు పిల్లలను కనిందని తెలిపారు.
గ్వాలియర్లోని గాంధీ జూపార్క్ని 8 హెక్టార్ల విస్తీర్ణంలో 1992లో నిర్మించారు. ఇది భారత్లో అతిపెద్ద జూలాజికల్ పార్కుల్లో ఒకటిగా గుర్తింపు పొందింది. ఈ పార్కుల సాధారణంగా కనిపించే అడవి జంతువులతోపాటు అరుదైన జాతుకు నిలంగా ఉంది. అరుదైన జంతువులు ఉండటంతో దీనిని రక్షిత ప్రదేశంగా ప్రభుత్వం ప్రకటించింది. గాంధీ జూపార్క్లో తెల్ల పులి, గోల్డెన్ నెమలి ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి.