Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నేడు మరోసారి సిబిఐ విచారణకు ఎంపీ అవినాష్ రెడ్డి హాజరు కానున్నారు. రెండు రోజుల పాటు సుదీర్ఘంగా అవినాష్ రెడ్డిని విచారించిన సిబిఐ…వైఎస్ వివేకా హత్య జరిగిన రోజు జరిగిన పరిణామాలపై ఆరా తీసింది. అవినాష్ రెడ్డికి వివేకానంద రెడ్డి కుటుంబానికి మధ్య విబేధాలపై సిబిఐ ఆరా తీసింది. నిందితులతో జరిపిన ఆర్ధిక లావాదేవీలపై ప్రశ్నించిన సిబిఐ.. 40 కోట్ల డీల్ పై అవినాష్ రెడ్డి పాత్రపై ఆరా తీసింది. సహజ మరణంగా ఎందుకు చిత్రికరించారని ప్రశ్నించిన సిబిఐ వివేకా చనిపోయిన రోజు అవినాష్ రెడ్డి కాల్స్ పై ఆరా తీస్తోంది. వైఎస్ భారతికి ఫోన్ చెయ్యడంపై పలు ప్రశ్నలు సంధించింది. ఎవిడెన్స్ టాంపరింగ్ పై కూపి లాగిన సిబిఐ అవినాష్ రెడ్డి విచారణ మొత్తం వీడియో గ్రఫీ చేస్తోంది. ఈ తరుణంలోనే నేడు మరో సారి సిబిఐ విచారణ కు హాజరు కానున్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. కాగా ఇప్పటికే వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.