Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమెరికా
అమెరికాలో మరో తెలుగు యువకుడు తుపాకీ తూటాకు ప్రాణాలు కోల్పోయాడు. పశ్చిమ కొలంబస్లో దుండగులు జరిపిన కాల్పుల్లో ఏలూరు జిల్లా వాసి సాయీశ్ వీర(24) మరణించారు. ఓహాయో రాష్ట్ర రాజధాని నగరం కొలంబస్ ప్రాంతంలో ఫ్రాంక్లిన్ గ్యాస్ స్టేషన్ వెనుక ఫుడ్ కోర్టు నిర్వహిస్తున్నారు. స్థానిక కాలమానం ప్రకారం, గురువారం మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ఇద్దరు ఆగంతకులు ఫుడ్ కోర్టులోకి చొరబడి తుపాకులతో విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సాయీష్ను స్థానిక ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.
వెస్ట్బ్రాడ్ స్ట్రీట్లోని షెల్ గ్యాస్ స్టేషన్లో సాయీశ్ క్లర్క్గా పనిచేస్తున్నాడు. సాయీష్ మరణం అతడి కుటుంబంలో పెను విషాదం నింపింది. మధ్యతరగతికి చెందిన సాయీష్ హెచ్-1బీ వీసా కూడా తీసుకున్నాడు. అందరితో కలివిడిగా ఉండేవాడని ఏసాయం అడిగినా కాదనకుండా చేసేవాడని స్నేహితులు తెలిపారు. కాగా.. ఈ దారుణానికి పాల్పడిన నిందితుల ఫొటోలను పోలీసులు విడుదల చేశారు.