Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నేడు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9:29 గంటల సమయంలో సెన్సెక్స్ 118 పాయింట్ల లాభంతో 59,750 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ 32 పాయింట్లు లాభపడి 17,657 దగ్గర కొనసాగుతోంది. ఈ తరుణంలో సెన్సెక్స్ 30 సూచీలో హెచ్సీఎల్ టెక్, కొటాక్ మహీంద్రా బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఇన్ఫోసిస్, విప్రో, ఏషియన్ పెయింట్స్, టైటన్, సన్ఫార్మా, టీసీఎస్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు లాభాల్లో ఉన్నాయి. టాటా స్టీల్, టెక్ మహీంద్రా, టాటా మోటార్స్, ఎల్అండ్టీ, మారుతీ, అల్ట్రాటెక్ సిమెంట్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ, ఎస్బీఐ, ఎంఅండ్ఎం షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.