Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : అయోధ్యలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రక్కు, బస్సు ఒకదానికొకటి ఢీ కొనడంతో ఏడుగురు మరణించారు. మరో 40మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులను అంబులెన్స్ ల సహాయంతో చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ట్రక్కు, బస్సు ఢీ కొనడంతో బస్సు నుజ్జునుజ్జ అయింది. దీంతో గాయపడిన వారిని బస్సు నుంచి బయటకు తీసేందుకు సహాయక సిబ్బందికి కష్టతరంగా మారింది. లక్నో-గోరఖ్ పూర్ హైవే పై ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కు వస్తున్న క్రమంలో ప్రయివేటు బస్సు అంబేద్కర్ నగర్ వైపు వెళ్లేందుకు హైవేపై టర్న్ తీసుకుంటుంది. దీంతో ఎదురుగా వస్తున్న లారీని బస్సు ఢీ కొట్టింది. ఈ ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో ట్రక్కు బోల్తాపడి బస్సు కిందపడిపోయిందని ఆయోధ్య చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అజయ్ వెల్లడించారు. ఈ రోడ్డు ప్రమాదంలో ఏడుగురు మరణించారని.. 40 మందికి పైగా గాయపడ్డారని తెలుస్తోంది. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.