Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
నటుడు శరత్ బాబు ఇటీవల అనారోగ్యానికి గురయిన విషయం తెలిసిందే. ఈ తరుణంలో గత కొంతకాలంగా బెంగళూరులో చికిత్స పొందుతోన్న ఆయన్ను మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు శుక్రవారం హైదరాబాద్ తీసుకువచ్చారు. నగరంలోని ఏఐజీ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ఐసీయూ నుంచి సాధారణ గదికి తరలించి చికిత్స కొనసాగిస్తున్నట్లు తెలిపారు.