Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - శ్రీహరికోట
భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన తిరుపతి జిల్లాలోని షార్ నుంచి పొలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్(పీఎస్ఎల్వీ)-సి55 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్డౌన్ ప్రక్రియ శుక్రవారం మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రారంభమైంది. ఇది నిరంతరాయంగా 25.30 గంటల పాటు కొనసాగిన తర్వాత మధ్యాహ్నం 2.20 గంటలకు పీఎస్ఎల్వీ వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లింది.
ఈ తరుణంలతో సింగపూర్కు చెందిన 741 కిలోల బరువుగల టెలీయోస్-2, 16 కిలోల లూమోలైట్-4 ఉపగ్రహాలను పీఎస్ఎల్వీ మోసుకెళ్లింది. టెలీయోస్-2 ఉపగ్రహం సింగపూర్ ప్రభుత్వానికి చెందింది. ఎస్టీ ఇంజినీరింగ్ భాగస్వామ్యంతో దీన్ని అభివృద్ధి చేశారు. ఇది అన్ని వాతావరణ పరిస్థితుల్లో రేయింబవళ్లు కవరేజీ అందించగలదు. లూమాలైట్-4 ఉపగ్రహాన్ని ఇన్స్టిట్యూట్ ఫర్ ఇన్ఫోకామ్ రీసెర్చ్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్లోని శాటిలైట్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేశారు.