Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
జమ్మూకశ్మీర్ పూంచ్ జిల్లాలో జరిగిన ఉగ్రదాడి ఘటన తర్వాత బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ రామ్గఢ్ సరిహద్దుల్లో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించింది. ఈ తరుణంలో అనుమానాస్పద కదలికలను పసిగట్టిన సైన్యం గాలులో కాల్పులు జరిపినట్లు సమాచారం. శనివారం ఉదయం 5 గంటలకు నారాయణపూర్ పోస్ట్ సమీపంలో పాక్ వైపు నుంచి అనుమానాస్పద కదలికలను గుర్తించారు. కాల్పుల అనంతరం సంఘటనా స్థలంలో తనిఖీలు చేపట్టారు. శుక్రవారం బీఎస్ఎఫ్ డీజీ సుజోయ్ లాల్ థౌసెన్ జమ్మూ కశ్మీర్కు చేరుకొని సరిహద్దుల్లోని భద్రతపై ఆరా తీశారు. పూంచ్లోని భింబర్ ప్రాంతంలో నియంత్రణ రేఖ వెంట బీఎస్ఎఫ్ భద్రతను మోహరించింది.