Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అరెస్టయిన వైఎస్ భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డిల నాలుగో రోజు సీబీఐ విచారణ ముగిసింది. ఇవాళ ఉదయం 9 గంటల సమయంలో చంచల్గూడ జైలుకు చేరుకున్న అధికారులు ప్రత్యేక వాహనంలో వారిని సీబీఐ కార్యాలయానికి తీసుకొచ్చారు. దాదాపు 6 గంటల పాటు ప్రశ్నించారు. హత్య జరిగిన రోజు, ఆ తర్వాత చోటు చేసుకున్న పరిణామాలపై వీరిద్దరినీ ప్రశ్నించినట్లు సమాచారం. మరో రెండు రోజుల పాటు కస్టడీ గడువు ఉండటంతో మరిన్ని వివరాలు రాబట్టే అవకాశం ఉంది.
విచారణ అనంతరం భాస్కర్రెడ్డి, ఉదయ్కుమార్రెడ్డిలను తిరిగి చంచల్గూడ జైలుకు తరలించారు. భాస్కరరెడ్డి సమక్షంలో ఉదయ్కుమార్రెడ్డిని అనేక ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ముఖ్యంగా వివేకానందరెడ్డి, భాస్కరరెడ్డి కుటుంబాల మధ్య ఉన్న సంబంధాలపై, 2017 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో నెలకొన్న పరిస్థితులపై ఆరా తీశారు. ఈ ఎన్నికల్లో తాను ఓడిపోవడానికి భాస్కరరెడ్డే కారణమని భావిస్తూ వివేకానందరెడ్డి వారిపై ఆగ్రహం వెలిబుచ్చినట్లు జరిగిన ప్రచారంపై ఉదయ్కుమార్రెడ్డిని అడిగారు. ఇరు కుటుంబాల మధ్య నెలకొన్న స్పర్థలు, వాటికి గల కారణాలపై సీబీఐ అధికారులు ప్రశ్నించారు.