Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - జగిత్యాల
ముత్యంపేట గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గీతకార్మికుడు ముత్యపు మల్లేశం తాటి చెట్టు ఎక్కుతుండగా చెట్టుపై పిడుగుపడి అక్కడికక్కడే మృతి చెందాడు. ఇదే తరుణంలో జిల్లాలోని మేడిపల్లి భీమారం మండలం గోవిందారంలో పిడుగుపాటుకు 20 మేకలు మృతి చెందాయి. మల్యాల మండలం మద్దుట్ల గ్రామంలో రాళ్ల వర్షం కురిసింది. కోరుట్లలోని కిష్టంపేటలో పిడుగుపాటుకు నాగుల రవి కి చెందిన గేదె మృతి చెందింది. ఈదురుగాలులతో కూడిన మోస్తారు వర్షం కురిసింది. కరెంట్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. సిరిసిల్లా మండలం దమ్మనపేటలో ఈదురుగాలులకు విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. విద్యుత్ షాక్ తో అన్నం నర్సగౌడ్కు చెందిన పాడి గేదె మృతి మృతి చెందింది.