Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
మాజీ మంత్రి, మాజీ ఎంపీ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డిని సీబీఐ నేడు విచారించింది. ఆయనకు తొలుత సీఆర్పీసీ 160 కింద నోటీసులు ఇచ్చారు. ఈ తరుణంలో రాజశేఖర్ రెడ్డి నేడు హైదరాబాదులోని సీబీఐ కార్యాలయానికి వచ్చారు. వివేకా హత్య జరిగిన స్థలంలో దొరికిన లేఖపై రాజశేఖర్ రెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. అంతే కాకుండా లేఖను ఎందుకు దాచిపెట్టమని చెప్పాల్సి వచ్చిందని వివరణ అడిగారు. కాగా, సీబీఐ విచారణ కొద్దిసేపటి కిందటే ముగియడంతో, రాజశేఖర్ రెడ్డి ఇంటికి వెళ్లిపోయారు.