Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అమరావతి: విజయవాడ నగరంలో గంజాయి విక్రయిస్తున్న సారమ్మ అనే మహిళకు పోలీస్ కమిషనర్ క్రాంతి రాణా టాటా నగర బహిష్కరణ విధించారు. సారమ్మపై అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో 13 కేసులు ఉన్నాయి. గత కొంతకాలంగా ఆమె అజిత్ సింగ్ నగర్ కేంద్రంగా గంజాయిని విక్రయిస్తోంది. పోలీసులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ సారమ్మలో మార్పు రాలేదు. దీంతో పోలీసులు ఆమెకు నగర బహిష్కరణ విధించారు. ఇప్పటివరకు కేవలం రౌడీషీటర్లకే నగర బహిష్కరణ విధించిన పోలీసులు... తొలిసారిగా గంజాయి విక్రయదారులపై నగర బహిష్కరణ వేటు వేశారు.