Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
కేంద్ర హోమంత్రి అమిత్ షా హైదరాబాద్ చేరుకున్నారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్న ఈ తరుణంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్, బీజేపీ ఎమ్మెల్యేలు రఘనందన్ రావు, ఈటల రాజేందర్ ఇతర ముఖ్య నేతలు ఘనస్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి నేరుగా అమిత్ షా చేవెళ్లలో బీజేపీ ఏర్పాటు చేసిన విజయసంకల్ప సభకు చేరుకోనున్నారు. అక్కడ దాదాపు గంట సేపు అమిత్ షా ఉండనున్నారు. ఇటీవల ఓ జాతీయ మీడియాతో మాట్లాడిన అమిత్ షా తాము కర్ణాటక తర్వాత తెలంగాణలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు.