Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్ 16వ సీజన్లో ఆర్సీబీ మరో విజయాన్నినమోదు చేసింది. ఆదివారం రాజస్తాన్తో జరిగిన మ్యాచ్లో ఏడు పరుగుల తేడాతో నెగ్గింది. కాగా ఈ మ్యాచ్లో ఫాఫ్ డుప్లెసిస్, గ్లెన్ మ్యాక్స్వెల్ అరుదైన రికార్డును తమ ఖాతాలో వేసుకున్నారు. ఐపీఎల్ హిస్టరీలో థర్డ్ వికెట్కు అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసిన జోడీగా రికార్డు సృష్టించాడు.
అంతేకాకుండా తము క్రియేట్ చేసిన రికార్డును 6 రోజుల్లోనే బ్రేక్ చేయడం గమనార్హం. రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో డుప్లెసిస్, మ్యాక్స్వెల్ ఇద్దరూ మూడో వికెట్కు 127 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అంతకు 6 రోజుల ముందు ఏప్రిల్ 17న చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 126 పరుగులతో పాట్నర్షిప్తో అదరగొట్టారు.