Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - తిరుమల: తిరుమలలో ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో 30 నిమిషాల పాటు వర్షం కురిసింది. అలాగే సాయంత్రం కూడా 6.30 గంటల సమయంలోనూ మరో 30 నిమిషాల పాటు వర్షం కురిసింది. శ్రీవారి ఆలయ ప్రాంతంతోపాటు మాడవీధులు, రోడ్డు, కాటేజీలు తడిచిముద్దయ్యాయి. హఠాత్తుగా కురిసిన వర్షానికి భక్తులు ఇబ్బంది పడ్డారు. వర్షం ఆగాక తిరుమల కొండ చల్లబడింది. శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులతోపాటు దర్శనం తర్వాత వెలుపలకు వచ్చే భక్తులు వర్షంతో తడుస్తూ వెళ్లారు. కొంతమంది వర్షం నిలిచేవరకు షెడ్ల కింద సేదతీరారు. రోడ్లు కూడా జలమయమయ్యాయి. ఘాట్లలో వాహనదారులు ఇబ్బంది పడ్డారు.