Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ప్రయాణికుల రద్దీ నేపథ్యంలో నేటి నుంచి వచ్చే నెల 14 వరకు హైదరాబాద్-సోలాపూర్ మధ్య ప్రత్యేక రైలు (07003/07004) అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. హైదరాబాద్(నాంపల్లి స్టేషన్) నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరుంది. ఈ రైలు బేగంపేట, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, సేడం, శహబాద్, కలబురిగి, గంగాపూర్ రోడ్, తిలాతి స్టేషన్ల మీదుగా ప్రయాణించి మధ్యాహ్నం 12.20 గంటలు సోలాపూర్ చేరుతుంది. తిరిగి 1.20 గంటలకు సోలాపూర్లో బయలుదేరి రాత్రి 8.30 గంటలకు నాంపల్లి చేరుకుంటుంది.