Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - మహబూబ్నగర్: మహబూబ్నగర్లో లారీ బీభత్సం సృష్టించింది. పట్టణంలోని అవంతి హోటల్ వద్ద వేగంగా దూసుకొచ్చిన లారీ అదుపుతప్పి ఓ బైకు, కాలేజీ బస్సును ఢీకొట్టింది. దీంతో ఓ వ్యక్తి అక్కడికక్కడమే మృతిచెందారు. కాలేజీ బస్సు డ్రైవర్తోపాటు మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. మృతుడిని మహబూబ్నగర్కు చెందిన సత్యనారాయణ (60)గా గుర్తించారు. కాగా, ప్రమాద సమయంలో బస్సులో ముగ్గురు విద్యార్థులు మాత్రమే ఉండటంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు తెలిపారు. ఈఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం మామిడాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. మామిడాల వద్ద ఓ మహిళను బస్సు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉన్నది.