Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అనంతపురం : పెన్నానదిలో అక్రమంగా ఇసుక తరలింపును నిరసిస్తూ తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర రెడ్డి ఆందోళన నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలోనే పెద్దపప్పూరు మండలం పెన్నానదిలో ఇసుక తరలింపు పరిశీలనకు వెళ్లాలని నిర్ణయించారు. దీంతో ఆయనను పోలీసులు ఇంటి నుంచి బయటకు రాకూడదంటూ హౌస్ అరెస్ట్ చేశారు. జేసీ నివాసం వద్దకు మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు. బ్యారికేడ్లు పెట్టి మరీ అడ్డుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు రాకుండా జేసీ నివాసం వద్ద పోలీసులు భారీగా మొహరించారు. జేసీ నివాసం చుట్టుపక్కల బ్యారికేడ్లు పెట్టి టీడీపీ నేతలు, కార్యకర్తలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. ముందస్తుగా పెద్దపప్పూరు మండలంలో టీడీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు.