Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కడప
మాజీ మంత్రి వైఎస్ వివేకా కూతురు సునీత వేసిన పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న విషయం తెలిసిందే. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు రద్దుపై సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకోనుంది. ఈ క్రమంలోనే స్పెషల్ పార్టీ పోలీసులు ముందస్తుగా పులివెందులకు చేరుకున్నారు. అవినాష్ రెడ్డి ఇంటి వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పులివెందుల పలు కూడళ్లలో స్పెషల్ పార్టీ పోలీసులు పహార కాస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటు చేసుకోకుండా ముందస్తుగా అదనపు పోలీస్ బలగాలు రంగంలోకి దిగాయి.