Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలంగాణలో ముస్లింల కోటాను రద్దు చేస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో దీనిపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగం చేయడం తప్ప తెలంగాణపై బీజేపీకి ఎటువంటి విజన్ లేదని ఓవైసీ అన్నారు. ఓవైసీ ఓవైసీ అంటూ మీరింకెన్నాళ్లు రోదిస్తుంటారని, ఉత్త డైలాగులు ఎన్నాళ్లు చెబుతారని, కొన్ని సార్లు వాస్తవాలు కూడా మాట్లాడాలన్నారు.
ముస్లింలకు వ్యతిరేకంగా విద్వేష ప్రసంగాలు చేయడం తప్ప.. తెలంగాణ వృద్ధిపై బీజేపీకి విజన్ లేదన్నారు. ఫేక్ ఎన్కౌంటర్లు చేయడం హైదరాబాద్పై సర్జికల్ స్ట్రయిక్స్ చేయడం, కర్ఫ్యూలు పెట్టడం, క్రిమినల్స్ను వదిలేయడం, బుల్డోజర్లను దింపడమే ఆ పార్టీకి తెలుసు అని ఓవైసీ ఆరోపించారు. తెలంగాణ ప్రజల్ని ఎందుకు అంతగా ద్వేషిస్తున్నారని షాను ఓవైసీ ప్రశ్నించారు. ఈ విషయాలను ఓవైసీ తన ట్విట్టర్ ద్వారా వ్యాఖ్యలు చేశారు.