Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: వైటీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేయడంతో ఆమె తల్లి విజయమ్మ జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ వద్దకు వెళ్లారు. పీఎస్లోకి పోలీసులు అనుమతించకపోవడంతో ఆమె వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో మహిళా కానిస్టేబుల్పై విజయమ్మ చేయిచేసుకున్నారు. నిరుద్యోగుల కోసం షర్మిల పోరాడుతోందని.. ఆమెను ఎందుకు అరెస్ట్ చేశారని విజయమ్మ ప్రశ్నించారు. ప్రజల కోసం పోరాడే గొంతుకను అరెస్ట్ చేస్తారా? అని నిలదీశారు. పోలీసులకు చేతనైన పని షర్మిలను అరెస్ట్ చేయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. బంజారాహిల్స్ పీఎస్లో కేసు నమోదైందని పోలీసులు విజయమ్మకు సూచించారు. అనంతరం పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించి అక్కడి నుంచి వెనక్కి పంపారు.