Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : న్యూజిలాండ్లోని కెర్మాడెక్ దీవుల్లో సోమవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పైన 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ పేర్కొంది. ఏప్రిల్ 24, 2023న 6:11:52 గంటలకు 7.2 తీవ్రతతో భూకంపం వచ్చిందని తెలిపింది. కెర్మాడెక్ దీవుల్లో పది కిలో మీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించింది. కెర్మాడెక్ దీవుల్లో భూకంపం తర్వాత న్యూజిలాండ్ లో ఎలాంటి సునామీ హెచ్చరికలు లేవని నేషనల్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ఏజెన్సీ తెలిపింది. ప్రాథమిక అంచనాల ప్రకారం ఈ భూకంపం వల్ల ప్రస్తుతానికి న్యూజిలాండ్ కు ఎలాంటి భారీ సునామీ అవకాశం లేదని ట్విట్టర్ ద్వారా వెల్లడించింది