Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : సీనియర్ నటుడు శరత్ బాబు ఆరోగ్యం విషమించింది. మల్టీ ఆర్గాన్స్ ఫెయిల్యూర్ అవటం వలన ఆరోగ్య పరిస్థితి మరికొంచెం క్షీణించింది అని తెలుస్తోంది. ఈనెల 20వ తేదీన, బెంగుళూరు నుంచి హైదరాబాద్ తీసుకువచ్చి ఏ.ఐ.జి హాస్పిటల్ లో జాయిన్ చేశారు. అయితే శరత్ బాబు కుటుంబ సభ్యులు హాస్పిటల్ యాజమాన్యానికి శరత్ బాబు ఆరోగ్యం గురించి ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయనవసరం లేదని చెప్పారని తెలిసింది. అలాగే శరత్ బాబు పరిస్థితి ఇప్పుడు ఎలా వుంది అన్న విషయం కూడా బయటకి ఎవరికీ చెప్పొద్దు అని కూడా శరత్ బాబు కుటుంబ సభ్యులు ఆసుపత్రి వర్గాలని కోరినట్టుగా తెలిసింది. అయితే శరత్ బాబు ఆరోగ్యం విషయం లో ఎటువంటి మార్పు లేదని, అతను ఇంకా వెంటిలేటర్ మీదే వున్నాడని తెలుస్తోంది.