Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - పాకిస్థాన్
పాకిస్థాన్లో పోలీస్ స్టేషన్ లక్ష్యంగా జరిగిన ఆత్మాహుతి దాడిలో 8మంది పోలీసులు సహా 12మంది దుర్మరణం చెందారు. మరో 20 మందికి పైగా గాయపడ్డారు. ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని కబాల్ ఠాణా వద్ద ఈ ఘటన జరిగింది. ఈ దాడితో ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఈ దాడికి ఏ ఉగ్రసంస్థ బాధ్యత తీసుకోనప్పటికీ.. ప్రభుత్వంతో కాల్పుల విరమణ ఒప్పందం ముగిసిన తర్వాత పాకిస్థానీ తాలిబన్లు ఈ తరహా దాడులకు తెగబడుతున్నారు. దీంతో తాజా దాడి వారి పనేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
అంతకుముందు పోలీస్ స్టేషన్లో జరిగిన 2 పేలుళ్లతో భవనం పూర్తిగా ధ్వంసమైనట్లు అధికారులు వెల్లడించారు. పోలీసులు కొందరు శిథిలాల కింద ప్రాణాలు కోల్పోయారని.. గాయపడినవారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించినట్లు తెలిపారు. ఈ ఘటనతో సమీప ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఇదే ఖైబర్ పఖ్తుంఖ్వా రాష్ట్రంలోని లక్కి మర్వాట్ జిల్లాలో కౌంటర్ టెర్రరిజం విభాగం చేపట్టిన ఆపరేషన్లో ముగ్గురు ఉగ్రవాదులతో పాటు ఓ పోలీసు అధికారి మృతి చెందారు. ఈ ఆపరేషన్ జరిగిన గంటల వ్యవధిలో ఈ పేలుళ్లు సంభవించడం చర్చనీయాంశమైంది.