Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా పడింది. పిటిషన్పై విచారణను తెలంగాణ హైకోర్టు 26వ తేదీకి వాయిదా వేసింది. వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని, దర్యాప్తు సమయంలో అతని నుంచి ప్రశ్న, జవాబులను లిఖిత/ ప్రింట్ రూపంలో తీసుకోవాలని, ప్రశ్నావళిని ముందస్తుగా అందించాలని తెలంగాణ హైకోర్టు ఈ నెల 18న జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింహలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసిన విషయం తెలిసిందే.