Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు పడతాయిన వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో వాతావరణం మారింది. గత రెండు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్నాయి. వచ్చే మూడు రోజులు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
నిన్న సాయంత్రం నుంచి హైదరాబాద్ సహా ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ తదితర జిల్లాల్లో వర్షాలు కురిసాయి. మరోవైపు ఏపీలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. విదర్భ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నుంచి మరట్వాడ మీదుగా కర్ణాటక వరకు ద్రోణి వ్యాపించిందని తెలిపారు. దీని ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో మంగళవారం అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. రాగల 24 గంటల్లో కోస్తా, రాయలసీమల్లో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. మరో ఐదు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది.