Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ ఢిల్లీ
దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఓ ప్రముఖ ఫాఠశాలకు బాంబు బెదిరింపు వచ్చింది. ఈ బెదిరింపులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. బుధవారం మథురా రోడ్లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు ఈ- మెయిల్ వచ్చింది. పాఠశాల ఆవరణలో బాంబులున్నాయంటూ అందులో పేర్కొనడంతో వెంటనే పాఠశాల యాజమాన్యం అప్రమత్తమైంది. తక్షణమే సిబ్బంది, విద్యార్థులను అక్కడి నుంచి బయటకు పంపించింది. ఈ తరుణంలో దీనిపై సమాచారమందుకున్న పోలీసులు, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టగా ఎలాంటి పేలుడు పదార్థాలను గుర్తించలేదు. ప్రస్తుతం ఈ-మెయిల్పై పోలీసులు దర్యాప్తు నిర్వహిస్తున్నారు.