Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో ఉప్పల్ రింగ్ రోడ్డులో నూతనంగా నిర్మించిన స్కైవాక్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఈ స్కైవాక్ను త్వరలోనే ప్రారంభిస్తున్నట్లు హెచ్ఎండీఏ ప్రకటించింది. ఈ స్కైవాక్ను రూ. 25 కోట్ల వ్యయంతో నిర్మించారు. దాదాపు 1,000 టన్నులకు పైగా స్టీల్ను వినియోగించి, అధునాతనంగా స్కైవాక్ను తీర్చిదిద్దారు. స్కైవాక్కు ఆరు ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఏర్పాటు చేశారు. నాగోల్ రోడ్డు, రామంతాపూర్ రోడ్డు, జీహెచ్ఎంసీ థీమ్ పార్క్, జీహెచ్ఎంసీ ఆఫీసు సమీపంలోని వరంగల్ బస్టాప్, ఉప్పల్ పోలీసు స్టేషన్, ఉప్పల్ ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ ఎదురుగా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లను ఏర్పాటు చేశారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని ఈ స్కైవాక్ను ఏర్పాటు చేసినట్లు హెచ్ఎండీఏ పత్రికా ప్రకటన విడుదల చేసింది. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ సూచనల మేరకు ఉప్పల్ స్కైవాక్ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.