Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - కేరళ
కేరళలో ప్రధాని మోడీ జెండా ఊపి ప్రారంభించిన తొలిరోజే.. వందేభారత్ రైలులో లీకులు కనిపించడంతో గమ్యస్థానమైన కాసర్గోడ్ వెళ్లాల్సిన సెమీ హైస్పీడ్ రైలు కన్నూర్ రైల్వేస్టేషనులో నిలిచిపోయింది. మంగళవారం ఉదయం తిరువనంతపురం నుంచి కాసర్గోడ్కు బయలుదేరిన రైలుకు మార్గమధ్యంలో ఎగ్జిక్యూటివ్ బోగీలోని ఏసీ గ్రిల్లో నీరు కారుతున్నట్లు అధికారులు గుర్తించారు. వెంటనే కన్నూర్లో నిలిపివేసి, ఐసీఎఫ్కు (ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) చెందిన సాంకేతిక నిపుణులు రైలులో మరమ్మతులు ప్రారంభించారు. మొదట్లో ఇలాంటి చిన్నపాటి సమస్యలు సాధారణమేనని అధికారులు తెలిపారు.