Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - డెహ్రాడూన్
ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ ఆలయాన్ని ఇవాళ ఉదయం తెరిచారు. ఛార్ధామ్ యాత్రలో భాగమైన ఆ ఆలయంలో నేటి నుంచి దర్శనాలు ప్రారంభం అయ్యాయి. ఉదయం 7.10 నిమిషాలకు ఆలయాన్ని ఓపెన్ చేశారు. సుమారు 15 క్వింటాళ్ల బంతి పువ్వులతో ఆలయాన్ని డెకరేట్ చేశారు. ఆర్మీ బ్యాండ్, జై బద్రీ జయజయధ్వానాల మధ్య ఆలయాన్ని తెరిచారు. భారీ సంఖ్యలో భక్తులు దర్శనం కోసం క్యూ కట్టారు. ఈనెల 25వ తేదీన కేదార్నాథ్ ఆలయాన్ని తెరిచిన విషయం తెలిసిందే.