Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
ఐపీఎల్-2023లో చిన్నస్వామి స్టేడియం వేదికగా జగిన మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు కోల్కతా నైట్రైడర్స్ ఊహించని షాకిచ్చింది. ఈ మ్యాచ్లో 21 పరుగుల తేడాతో తన హోం గ్రౌండ్లోనే ఆర్సీబీని చిత్తు చేసింది. 201 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 179 పరుగులకే పరిమితమైంది.
ఇక ఈ మ్యాచ్లో టాప్ స్కోరర్గా నిలిచిన కేకేఆర్ ఓపెనర్ జాసన్ రాయ్కు బిగ్ షాక్ తగిలింది. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు రాయ్కు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించాడు. అతడి మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధిస్తున్నట్లు ఐపీఎల్ ఓ ప్రకటనలో పేర్కొంది. అతడు ఐపీఎల్ ప్రవర్తనా నియమావళి ఆర్టికల్ 2.2ను రాయ్ ఉల్లంఘించినట్లు తెలిపింది. ఈ నియమం ప్రకారం ఆటగాడు క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తిస్తే జరిమానా విధిస్తారు. అయితే రాయ్ ఏమి నేరం చేశాడన్నది ఐపీఎల్ నిర్వాహకులు వెల్లడించలేదు.