Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చలు జరిపి నిర్ణయాలు తీసుకున్నారు.
తీర్మానాలు ఇవే..
దేశంలో గుణాత్మకమైన మార్పును సాధించే దిశగా బిఆర్ఎస్ ఉద్యమ స్పూర్తితో పురోగమించాలని కోరుతూ తీర్మానం..
- దేశానికి సాగునీటి విధానం రూపొందించాలి...
- వ్యవసాయానికి పెట్టుబడి సాయం దేశ వ్యాప్తంగా అమలు చేయాలని..
- భారత ప్రజలను ఏకం చేసి బలీయమైన రాజకీయ శక్తిగా బిఆర్ఎస్ ముందుకు వెళ్లాలని..
- బీఆర్ఎస్ నేతృత్వంలో దేశ అవసరాలకు సమగ్ర సాగునీటి విధానం రూపొందించాలని..
- తెలంగాణలో వున్న రైతు రాజ్యం దేశం అంతటా స్థాపించాలని..ఇందుకోసం అలుపెరుగని పోరాటం దిశగా బిఆర్ఎస్ ముందుకు వెళ్ళాలని..
- కేంద్ర ప్రజా వ్యతిరేక విధానాలను తుదముట్టించేందుకు బీఆర్ఎస్ దేశ వ్యాప్తంగా ఉద్యమాలు నిర్మించాలని..
- నూతన విద్యుత్ విధానాన్ని బీఆర్ఎస్ అమల్లోకి తీసుకురావాలని...
- దళిత బంధు పధకాన్ని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని..
- దేశంలో మౌళిక వసతుల కల్పన చేయాలని...
- కేంద్రంలో బీసీ సంక్షేమ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని...
- మతోన్మాద శక్తుల పట్ల యువత అప్రమత్తంగా ఉండాలని సమావేశంలో తీర్మానాలు చేశారు.