Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు లాభాలను కొనసాగించాయి. విదేశీ సంస్థాగత మదుపరుల నుంచి కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లలో జోష్ నెలకొంది. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 349 పాయింట్లు లాభపడి 60,649కి చేరుకుంది. నిఫ్టీ 101 పాయింట్లు పెరిగి 17,915 వద్ద స్థిరపడింది.