Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - హైదరాబాద్
దేశవ్యాప్తంగా సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) పరీక్షను జూలై, ఆగస్టులో నిర్వహించనున్నట్టు సీబీఎస్ఈ తెలిపింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం కాగా, మే 26 తుది గడువు అని వెల్లడించింది. కాగా, ఈసారి తెలంగాణలో ఉన్న ఆరు పరీక్ష కేంద్రాలను నాలుగుకు కుదించారు. నల్లగొండ, కరీంనగర్ కేంద్రాలను తొలగించి, హైదరాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్నగర్ పరీక్ష కేంద్రాలను మాత్రమే కేటాయించారు.