Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వరంగల్: జనగామలో కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క పాదయాత్రలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మాజీ ఎంఎల్ఎ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, మాజీ మంత్రి, రాష్ట్ర కాంగ్రెస్ అగ్రనేత పొన్నాల లక్ష్మయ్య వర్గీయుల పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఉద్రిక్తతల మధ్యనే భట్టి పాదయాత్ర కొనసాగిస్తున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఆందోళనకారులను చెదరగొడుతున్నారు. గత కొన్ని రోజుల నుంచి భారత్ జోడో యాత్ర సందర్భంగా కొమ్మూరి జనగాంలో పాదయాత్ర చేసిన విషయం తెలిసిందే.