Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండల తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. సిర్సనగండ్ల వీఆర్ఏ భర్త వెంకటయ్య 75 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి వలకు చిక్కారు. స్థిరాస్తి వ్యాపార లావాదేవీలకు సంబంధించి లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. ఎమ్మార్వో సూచన మేరకే వీఆర్ఏ భర్తకు డబ్బులు ముట్ట చెప్పినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఎసిబి అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.