Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : లైంగిక వేధింపులపై రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చైర్మన్ బ్రిజ్ భూషణ్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ దేశ రాజధాని ఢిల్లీలో రెజ్లర్లు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. రెజ్లర్లకు తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మద్దతు తెలిపారు. రెజ్లర్లు ఒలింపిక్స్లో దేశానికి ఖ్యాతి తెచ్చిన సమయంలో సంబురాలు చేసుకున్నామని, న్యాయం కోసం పోరాడుతున్న రెజ్లర్లకు అండగా నిలువాలని పిలుపునిచ్చారు. రెజ్లింగ్ సమాఖ్య చీఫ్పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరగాలన్నారు. రెజ్లర్లకు న్యాయం జరగాల్సిందేనన్న కేటీఆర్.. హృదయపూర్వక మద్దతు ప్రకటిస్తున్నానన్నారు.