Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్ : ఢిల్లీలో నమ్మశక్యం కాని ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. 8వ తరగతి చదువుతున్న ఓ బాలుడిని తోటి విద్యార్థులే హత్య చేశారు. రాజధానిలోని బదర్పూర్ ప్రాంతంలోని కాలువలో గురువారం రాత్రి పోలీసులకు స్కూల్ యూనిఫాంలో ఉన్న ఓ విద్యార్థి మృతదేహం లభించింది. ఆ పక్కనే విద్యార్థి స్కూల్ బ్యాగ్ కూడా కనిపించింది. దీని ఆధారంగా పోలీసులు బాలుడి వివరాలు సేకరించారు.
మృతుడి పేరు సౌరభ్ అని, అతడు మోలడ్బంద్ గ్రామ బిలాస్పూర్ క్యాంపులో నివసిస్తుంటాడని గుర్తించారు. ఇక విచారణ సందర్భంగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. సౌరభ్ స్నేహితులు ఇద్దరు తమ స్కూల్ సమీపంలో సిగరెట్ తాగుతూ అతడి కంట పడ్డారు. దీంతో, టీచర్లకు ఫిర్యాదు చేస్తానని సౌరభ్ హెచ్చరించాడు. ఈ క్రమంలో వారు అతడి తలపై తీవ్రంగా కొట్టి చంపేశారు. కాగా, బాలుడి మృతదేహాన్ని ఎయిమ్స్కు తరలించిన పోలీసులు, ఇద్దరు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. జువెనైల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచారు.