Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్: వేడి నీటిలో పడి బాలిక మృతి చెందిన సంఘటన ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. స్థానికుల కథనం ప్రకారం. ఎపి లోని ఆదోని మండలం హన్వాల్ గ్రామానికి చెందిన గొల్ల హరిప్రియ (06) ఈ నెల 22 న ఉదయం ప్రమాదవశాత్తు ఇంటి ముందు పోయ్యిపై ఉన్న వేడి నీటి గిన్నెపై పడింది. ఈ ఘటనలో చిన్నారి తీవ్రంగా గాయపడింది. దీంతో కుటుంబ సభ్యులు చిన్నారిని చికిత్స నిమిత్తం కర్నూలు తరలించారు. అక్కడ ఆస్పత్రిలో చికిత్స పోందుతూ చిన్నారి శుక్రవారం రాత్రి మృతి చెందింది. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.