Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - ఇండోర్
కొందరు సున్నిత మనస్కులు చాలా చిన్న కారణాలకే తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. తాజాగా అలాంటి ఘటనే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఇండోర్ జిల్లా కేంద్రంలో జరిగింది. భర్త బ్యూటీపార్లర్కు వెళ్లనివ్వలేదన్న కారణంతో భార్య ఆత్మహత్య చేసుకుంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇండోర్ పట్టణంలోని ఎరోడ్రోమ్ పోలీస్స్టేషన్ పరిధిలో నివసించే రీనా యాదవ్.. గురువారం ఉదయం తన భర్త విధులకు బయలుతేరుతుండగా తాను బ్యూటీపార్లర్కు వెళ్తానని అడిగింది. అందుకు భర్త నిరాకరించాడు. అక్కర్లేదని చెబుతూ డ్యూటీకి వెళ్లిపోయాడు. అతను డ్యూటీ నుంచి తిరిగి వచ్చేసరికి రీనా యాదవ్ ఇంట్లోని సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయి ఉంది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.