Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - అమరావతి: ఏపీవ్యాప్తంగా మార్గదర్శి బ్రాంచ్ల్లో సీఐడీ సోదాలు చేపట్టింది. గాజువాక, సీతంపేట, తెనాలి, ప్రొద్దుటూరు బ్రాంచ్ల్లో సీఐడీ తనిఖీలు నిర్వహిస్తుంది. డిపాజిట్ సొమ్మును వేర్వేరు సంస్థలకు మళ్లించడంపై సోదాలు జరుపుతోంది. మార్గదర్శి బ్రాంచ్ల్లోని రికార్డులను సీఐడీ అధికారులు పరిశీలిస్తున్నారు. కాగా, భారీగా నల్లధనం మార్పిడికి మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాలు కేంద్ర స్థానంగా మారినట్లు సీఐడీ గుర్తించిన సంగతి తెలిసిందే. రశీదుల రూపంలో బ్రాంచీ కార్యాలయాల నుంచి ప్రధాన కార్యాలయానికి చేరిన భారీ నిధుల వెనుక మనీ లాండరింగ్ ఉన్నట్లు వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా మార్గదర్శి చిట్ఫండ్స్ కార్యాలయాల్లో సీఐడీ అధికారుల బృందం సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను సేకరించింది.
చందాదారుల నిధుల మళ్లింపు, అక్రమ పెట్టుబడులు, అక్రమ డిపాజిట్ల సేకరణ తదితర అభియోగాలతో ఏ–1గా మార్గదర్శి చిట్ఫండ్స్ చైర్మన్ చెరుకూరి రామోజీరావు, ఏ–2గా చెరుకూరి శైలజా కిరణ్, ఏ–3గా బ్రాంచీ మేనేజర్లపై కేసులు నమోదైన విషయం విదితమే. ఈ కేసులో ఇటీవల రామోజీరావు, శైలజను విచారించడంతోపాటు హైదరాబాద్లోని మార్గదర్శి చిట్ఫండ్స్ ప్రధాన కార్యాలయంలో సోదాలు చేపట్టి పలు అవకతవకలను గుర్తించారు. ఆ సోదాలకు కొనసాగింపుగా మార్గదర్శి చిట్ఫండ్స్ బ్రాంచీ కార్యాలయాల్లో ఏకకాలంలో సోదాలు జరుగుతున్నాయి.