Authorization
Wed March 05, 2025 01:50:43 pm
నవతెలంగాణ- గాంధీనగర్: 'మోడీ ఇంటిపేరు' వివాదంలో సూరత్ కోర్టు ఇచ్చిన తీర్పుపై 'స్టే' ఇవ్వాలని కోరుతూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను గుజరాత్ హైకోర్టు మే 2వ తేదీకి వాయిదా వేసింది. అదే రోజు తమ సమాధానం ఏమిటో కోర్టుకు తెలియజేయాలని రాహుల్ తరఫు న్యాయవాది అభిషేక్ సింఘ్విని కోర్టు ఆదేశించింది. మే 2న ఇరువర్గాల తుది వాదనలు వింటామని తెలిపింది.